కాస్త డిఫరెంట్గా జంట నామినేషన్.. ఔటయ్యేదెవరో!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాల్టీ బిగ్బాస్ సీజన్-3లో మూడు వారాల పాటు ఒక్కొక్కరినే ఎలిమినేట్ చేసిన బిగ్బాస్ ఇక నుంచి కాస్త డిఫరెంట్గా ఇద్దర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెప్పడం కాకుండా.. ఇద్దరిద్దర్ని పిలిపించి మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారు? అంటూ డిఫరెంట్గా కాస్త కొత్తగా నామినేషన్స్ మొదలుపెట్టారు.
ఇద్దరుగా వెళ్లి ఒక్కొక్కరుగా..!
రవి- వితికా జంటగా వెళ్లగా.. రవిని వితికా రిక్వెస్ట్ చేయడంతో తనకు తానుగా రవి నామినేట్.
రోహిణి- శివ జ్యోతి... జంటగా వెళ్లగా ఇద్దరి మధ్య అండర్స్టాడింగ్తో శివజ్యోతి నామినేట్ కావడంతో రోహిణి సేఫ్.
వరుణ్- మహేష్.. జోడీగా వెళ్లగా ఏకాభిప్రాయంతో వరుణ్ సేఫ్ కావడానికి ఒప్పుకోవడంతో మహేష్ సేఫ్ అయ్యాడు.
బాబా భాస్కర్- అషు రెడ్డిలు జంటగా వెళ్లగా.. నేనే నామినేట్ అవుతా అని బాబా భాస్కర్ స్వచ్ఛందంగా ప్రకటించారు.
హిమజ- రాహుల్లు జంటగా వెళ్లగా.. హిమజ సేఫ్.
ఆ ఇద్దరి షాకిచ్చిన బాస్!
మొత్తమ్మీద చూస్తే.. రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు నాలుగో వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఔటవ్వనున్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వరుణ్ లేదా బాబా భాస్కర్ ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుస్తోంది. అయితే నామినేషన్స్ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ హెచ్చరిస్తూ.. ఇద్దర్నీ డైరెక్ట్గా నామినేట్ చేసి ఊహించని షాకిచ్చారు. ఈ వ్యవహారం పూర్తయిన తర్వాత హౌస్లో బక్రీత్ సంబరాలు జరుపుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ మొత్తమ్మీద వరుణ్-వితికా, తీన్మార్ సావిత్రి-రోహిణిల వ్యవహారం ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout