మే11 నుంచి హైద్రాబాద్ లో 'పడి పడి లేచే మనసు' తాజా షెడ్యూల్

  • IndiaGlitz, [Wednesday,May 09 2018]

యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం పడి పడి లేచే మనసు. శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల కలకత్తాలో ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం హైద్రాబాద్ చేరుకొంది. మే 11 నుంచి హైద్రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది.

నేడు (మే 9) చిత్ర కథానాయకు సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హను రాఘవపూడి స్టైల్ లో టిపికల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హైద్రాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' మొదటి పాట విడుదల

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా

సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి

ఈ భూమికి ఒకే ఒక ఆకాశం అలాగే చలన చిత్ర పరిశ్రమకి ఒకే ఒక సావిత్రి.సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి.

మే 11న 'స‌మ్మోహ‌నం'తొలి గీతం ఆవిష్క‌ర‌ణ‌

సినిమా, సాహిత్యం ఎప్పటికీ బ‌తికే ఉంటాయి అనే ఆస‌క్తిక‌ర‌మైన డైలాగుతో ఇటీవ‌ల విడుద‌లయిన `స‌మ్మోహ‌నం`

పేదల పెన్నిధిలా మనం సైతం...

సాయం కోరిన పేదలను ఆదుకుంటున్న సేవా సంస్థ మనం సైతం తన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది.

జూన్ 1న విడుదలవుతున్న 'శరభ'

ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా.. సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శరభ'.