'ప‌డ‌సావే' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ప‌డేసావే'. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు' స‌ర్టిఫికేట్ అందుకుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో సినిమా ఫిభ్ర‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌టం లాంచ‌నంగా మారింది.

ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో బాయ్‌ఫ్రెండ్స్‌, మ‌గ‌వాళ్ళు ఎలా ఉండాల‌ని అమ్మాయిలు కోరుకుంటారో విష‌యాలు తెలుసుకోవాంటే సినిమాచూడాల్సిందేనని ఆడియో వేడుక‌లో నాగార్జున పెర్కొన‌డం విశేషం. చునియా మంచి స్క్రిప్ట్‌తో వ‌స్తే తాను న‌టించ‌డానికి సిద్ద‌మేన‌ని,సినిమాను చునియా ఆ రేంజ్‌లో తెర‌కెక్కించింద‌ని నాగార్జున పెర్కొన‌డం విశేషం.