'ఊపిరి' అప్పుడేన‌ట‌

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌తున్న సినిమా 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ ఆ స్టార్ హీరోలు కాగా.. హీరోయిన్ పాత్ర‌లో త‌మ‌న్నా, అతిథి పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా త‌మిళంలో 'తోళా' పేరుతో రూపొందుతోంది.

పారిస్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి అఫీషియ‌ల్ రీమేక్‌. ఇదిలా ఉంటే.. చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2016లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో ఈ సినిమా రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంద‌ట‌.