ప్రభుదేవాతో మరోసారి...

  • IndiaGlitz, [Friday,June 30 2017]

కొరియోగ్రాఫర్‌ నుండి డైరెక్టర్‌గా మారిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ మధ్య నటుడుగా కూడా బిజీ అవుతున్నారు మన ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌. త్వరలోనే మరోసారి మెగాఫోన్‌ చేపట్టనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తాడని ఫిలింనగర్‌ వర్గాల సమాచారం. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్‌ చేసిన 'పౌర్ణమి' బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో ప్రభుదేవా ఈసారి ఎలాగైనా ప్రభాస్‌తో మంచి హిట్‌ కొట్టాలనుకుంటున్నాడట.
అయితే ప్రభాస్‌ ఇప్పుడు సుజిత్‌ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా సినిమా చేయాల్సి ఉంది. సాహో పూర్తి కాగానే రాధాకృష్ణ సినిమాతో పాటు ప్రభుదేవా సినిమా కూడా సెట్స్‌ పైకి వెళుతుందట. ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం పూర్తి స్థాయిలో నోరు మెదపడం లేదు కానీ ప్రభాస్‌ సినిమా చేయాలనుకుంటున్నానని, సాహో తర్వాత అది ఫైనలైజ్‌ అవుతుందని సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి.