నాగ్ తో మరోసారి....

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాను పూర్తి చేసి, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రం 'రాజుగారి గ‌ది-2'. రీసెంట్‌గా లాంచ్ అయిన ఈ సినిమా నాగ్ పాత్ర మ‌నుషుల ప్రాణాల‌తో ఆడుకునేలా ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నార‌ట‌. అందులో ఓ హీరోయిన్‌గా త్రిష పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇది వ‌ర్క‌వుట్ అయితే గ‌తంలో కింగ్ చిత్రంలో నాగ్‌తో జోడి త్రిష జోడి క‌ట్టే రెండో సినిమా ఇదే అవుతుంది.