ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ విల‌న్‌గానే

  • IndiaGlitz, [Monday,July 18 2016]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ 2005లో వ‌చ్చిన జై చిరంజీవ సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌ళ్ళీ టాలీవుడ్‌లో నటించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్ళీ మ‌రో తెలుగు సినిమాలో నెగ‌టిల్ రోల్‌టో క‌నిపించనున్నాడు. రాజ్‌త‌రుణ్, వంశీకృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో అర్భాజ్ న‌టిస్తున్నాడు.

ముందుగా ఈ రోల్‌కు బాలీవుడ్ హీరో గోవిందాను సంప్ర‌దించారు. అయితే పాత్ర నిడివి త‌క్కువ‌గాఉంద‌ని, ఇంకా పెంచాల‌నడంతో పాటు కొన్ని కండీష‌న్స్ పెట్టాడ‌ట‌. దాంతో యూనిట్ అర్బాజ్‌ను సంప్ర‌దించిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. క్రైమ్ కామెడి జోన‌ర్లో రానున్న ఈచిత్రంలో అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.