ఫిదా విడుద‌లైన రోజునే..

  • IndiaGlitz, [Friday,May 11 2018]

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు చాన్నాళ్ళ త‌రువాత మంచి విజ‌యాన్ని అందించింది. అంతేగాకుండా, నిర్మాత దిల్ రాజుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే.. ఈ సినిమా విడుద‌ల తేదినే త‌న మ‌రో సినిమాకి కూడా దిల్ రాజు ఫిక్స్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. నితిన్, రాశి ఖ‌న్నా, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నివాస క‌ళ్యాణం పేరుతో దిల్ రాజు ఓ సినిమాని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమాని జూలైలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లుగా గ‌త కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఫిదా విడుద‌ల తేది అయిన జూలై 21నే శ్రీ‌నివాస క‌ళ్యాణంని కూడా విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌స్తుంది. 

More News

'నేల టిక్కెట్టు' ఆడియో విడుద‌ల‌

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు.

సైరా ఆగ‌మ‌నం ఎప్పుడంటే..

ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త‌న కెరీర్‌లో 150వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో..

చైత‌న్య సంద‌డి అప్పుడే!

గ‌తేడాది వేస‌వికి రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నారు యువ‌క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఆ త‌రువాత చేసిన యుద్ధం శ‌ర‌ణం నిరాశ‌ప‌రిచింది.

'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్

ఆకాశ్ పూరి బిగ్ స్టార్‌గా ఎద‌గాలి - ప్ర‌భాస్‌

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య