ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు..!

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం నమో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకం పై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి, మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన వ‌చ్చింది.
తాజాగా రిలీజ్ చేసిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం టీజర్ కు కూడా అనూహ్యమైన స్పంద‌న ల‌భిస్తోంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా.. ఆనంద నిలయ వర పరిపాలకా..' అంటూ సాగే పాట అందర్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. 'ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా.. ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుడి సాక్షిగా, పదివేల పడగల బుస బుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను' అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ తో ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా రూపొందుతుంది అని తెలుస్తుంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియోను జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.