'ఒక్క క్షణం' ఆ సినిమాకి కాపీ వెర్షనా?

  • IndiaGlitz, [Monday,December 11 2017]

అల్లు శిరీష్‌, సుర‌భి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం 'ఒక్క క్ష‌ణం'. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రంతో ఆక‌ట్టుకున్న వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కొరియ‌న్ మూవీ పార‌లెల్ లైఫ్ ఆధారంగా రూపొందింద‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఒక్క క్ష‌ణం టీజ‌ర్లో చూపిన‌ట్లుగానే ఈ కొరియ‌న్ చిత్రంలోనూ ఓ జంట ప్ర‌జెంట్‌.. ఇంకో జంట ఫ్యూచ‌ర్ గా ఉంటుంది. ప్యారలెల్ లైఫ్ విడుద‌లైన ఏడేళ్ల త‌రువాత‌.. తెలుగులో అదే పాయింట్‌తో వ‌స్తున్న 'ఒక్క క్ష‌ణం'..

ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని తెర‌కెక్కిందో లేదంటే కాపీ వెర్ష‌న్ గా ఉంటుందో తెలియాలంటే డిసెంబ‌ర్ 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. అంతేకాకుండా.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమాలోని పాట సో మెనీ సో మెనీ.. యూట్యూబ్‌లో ఎంతో పాపుల‌ర్ అయిన‌ షేప్ ఆఫ్ యు అనే సాంగ్ ట్యూన్‌తోనే ఉందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

More News

'హలో'.. అనూప్ మెప్పించాడు

జై చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనూప్ రూబెన్స్.. హలో చిత్రంతో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు.

అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంగీత దర్శకుడు అంటే మొదటగా వినిపించే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.

వస్తున్నాం..బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !! - కింగ్ నాగార్జున

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను `హలో`అంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయన కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక

రాజ‌మౌళి.. కుటుంబ‌క‌థా చిత్రం?

స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబ‌లి 2 వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేయ‌బోతున్నార‌ని చాలా రోజులుగా వారĺ

డ్యాన్స్ టీచ‌ర్‌గా రాశి ఖ‌న్నా

జై ల‌వ కుశ‌, ఆక్సిజ‌న్ చిత్రాల‌తో ఈ ఏడాది సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.