మార్చి 11న విడుదలవుతున్న 'ఓ స్త్రీ రేపు రా'

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. అశోక్‌ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా...

దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ''ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునేవారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ను సినిమాటిక్‌గా, డిఫరెంట్‌గా ఉండాలని కో ప్రొడ్యూసర్‌ ప్రవీణ్‌ సపోర్ట్‌తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించాం. 'కల్పితమా..కచ్చితమా' ఉపశీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. ఘంటశాల విశ్వనాథ్‌ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ప్రమోషనల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మ్యూజిక్‌తో పాటు సినిమాలో రీరికార్డింగ్‌ హైలైట్‌ కానుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

More News

రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్2'

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్ 2.

బాలయ్య వందో సినిమా లేటెస్ట్ న్యూస్...

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా డైరెక్టర్ ఎవరు అనే విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకుంటున్న క్షణం.

భారీ చిత్రాలను నిర్మిస్తున్న పి.వి.పి సంస్థ కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం.అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ.

కళ్యాణ్ రామ్ రోల్ ఏంటంటే...

గతేడాది పటాస్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'బంతిపూల జానకి'

ధన్ రాజ్,దీక్షాపంత్,షకలక శంకర్,అదుర్స్ రఘు,వేణు,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ,సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'బంతిపూల జానకి'.