'నాయకి' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Friday,March 18 2016]

త్రిష ప్రధాన పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గోవి దర్శత్వంలో మామిడిపల్లి గిరిధర్, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగి నిర్మిస్తున్న చిత్రం నాయకి. ఈ సినిమా టీజర్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...

దాసరి నారాయణరావు మాట్లాడుతూ 'టీజర్ బావుంది. సినిమా కూడా బావుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. సినిమాను సరిగ్గా తీస్తే హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకండా హీరియన్ సెంట్రిక్ మూవీస్ ఉంటాయి. గోవికి అభినందనలు. త్రిష మంచి పెర్ ఫార్మర్. రఘకుంచె మంచి సంగీతం అందిస్తే, సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. యూనిట్ కు అభినందనలు'' అన్నారు.

త్రిష మాట్లాడుతూ 'నేను నటించిన తొలి హర్రర్ మూవీయే కాదు, హీరోయిన్ సెంట్రిక్ మూవీ కూడా ఇదే. సినిమా ఆడియో త్వరలో విడుదల చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

దర్శకుడు గోవి మాట్లాడుతూ 'గిరిధర్ గారు కథ వినగానే త్రిషను కలిసి కథ చెప్పాం. ఆవిడ వెంటనే ఓకే చెప్పారు. తెలుగు, తమిళంలో గిరిధర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. త్రిష ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఉండే సినిమా అవుతుంది. రేట్రో హర్రర్ కామెడి కాన్సెప్ట్ మూవీ ఇది'' అన్నారు.

నిర్మాత మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ 'నేను త్రిష దగ్గర 7-8 సంవత్సరాల నుండి మేనేజర్ గా చేస్తున్నాను. మేనేజర్ కు సినిమాలు చేసిన హీరోయిన్స్ లో విజయశాంతి తర్వాత త్రిష మాత్రమే. ఇది మా బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా. త్రిష కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతుంది. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం''అన్నారు.

ఈ కార్యక్రమంలో సత్యంరాజేష్, గణేష్ వెంకట్రామన్, సాయికార్తీక్, రఘుకుంచె, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.