'నువ్వు-నేను' హీరోయిన్‌కి అబ్బాయి

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

'నువ్వు నేను' హీరోయిన్ అనిత హస్సనందనీ రెడ్డి ఇంట వారసుడు వచ్చాడు. దాంతో ఆమె భర్త రోహిత్ రెడ్డి, ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా వున్నారు. మంగళవారం రాత్రి పండంటి అబ్బాయికి అనిత జన్మనిచ్చారు. ఆమె భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ న్యూస్ షేర్ చేశారు. భార్యకు ముద్దుపెడుతున్న ఫొటో పోస్ట్ చేసిన రోహిత్, 'ఓ బాయ్' అని కన్ఫర్మ్ చేశాడు.

గోవాకు చెందిన కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డి, అనిత అక్టోబర్ 14, 2013లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఏడేళ్ళకు తొలి సంతానం కలిగింది. యాక్టింగ్ తో అనిత బిజీగా ఉండటంతో తల్లి కావడానికి టైమ్ తీసుకున్నారని చెప్పవచ్చు. కరోనా బ్రేక్ లో ప్లాన్ చేశారనీ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న భర్తతో కలిసి ఉన్న వీడియో పోస్ట్ చేసిన అనిత, ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు.

'నువ్వు నేను' హిట్ తరువాత తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ లాంగ్వేజెస్ లో అనిత సినిమాలు చేశారు. అలాగని, సినిమాలు రావడానికి కారణమైన సీరియల్స్ ను వదిలిపెట్టలేదు. రెండు కంటిన్యూ చేశారు. ప్రజెంట్ సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ చేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం ఆర్పీ పట్నాయట్ 'మనలో ఒకడు' ఆమె చేసిన లాస్ట్ సినిమా.

More News

పార్టీ వద్దని షర్మిలకు నచ్చజెప్పాం: సజ్జల

తెలంగాణలో ఊహించని రీతిలో దివంగత ముఖ్యమంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

శశికళకు రజినీకాంత్ ఫోన్..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

‘శ్రీకారం’ టీజర్ : ఈ ఒక్క‌టీ.. జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది

యంగ్ హీరో శ‌ర్వానంద్, క్యూట్‌ బ్యూటీ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'శ్రీ‌కారం'‌.

షర్మిల కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలివే...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని లోటస్‌పాండ్‌లో నిర్వహించారు.

నేనెందుకు పార్టీ పెట్టకూడదు.. రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల

తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో వైఎస్ షర్మిల మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.