ఎన్టీఆర్‌ డ‌బుల్ ట్రీట్ ఇస్తాడా?

  • IndiaGlitz, [Friday,April 17 2020]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రౌద్రం ర‌ణం రుధిరం సినిమా నుండి చ‌ర‌ణ్‌కు సంబంధించిన వీడియో ప్రొమోను అందించిన రాజ‌మౌళి.. ఇప్పుడు మే 20 న తార‌క్ కోసం మ‌రో ప్రొమోను అందించ‌బోతున్నార‌ట‌. అందుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మ‌రో ప‌క్క డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కూడా ఎన్టీఆర్ అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌న 30వ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లుక్ లేక టైటిల్‌ను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తొలి చిత్రంలో ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌గా తార‌క్‌ను ఎలివేట్ చేసిన త్రివిక్ర‌మ్ ఈసారి ఎలా పొట్రేట్ చేయ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక ప‌క్క ఆర్ఆర్ఆర్ ప్రోమో.. మ‌రో ప‌క్క ఎన్టీఆర్ 30 టైటిలో, లుక్కో విడుద‌లైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది. మ‌రి ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు తార‌క్ అభిమానుల‌కు ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌నున్నారో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

More News

చిరుతో క‌లిసి న‌టించ‌నున్న స్టైలిష్ స్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అండ

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తబ్దుగా మారింది. మన దేశం విషయానికి వస్తే మే 3 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సామాన్య ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.

ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్‌లో 'కబ్జా' ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా 'కబ్జా'. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

కరోనాతో పోల్చితే బిన్ లాడెన్ ఓ బచ్చా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు,

జగన్ క్యాంప్ ఆఫీస్‌లో కీలక మార్పు.. ధర్మచక్రం ఔట్!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలన ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతున్నారు.