ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా అప్పుడేనా?

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్ట‌మౌతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రాన్ని టేకాఫ్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌.. ఆ సినిమా విడుద‌ల‌య్యాకే తార‌క్ సినిమా ప‌నులు ప్రారంభిస్తాడ‌ని.. అటుఇటుగా ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళుతుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌రువాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న కొత్త చిత్రం జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

More News

'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.

మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని   క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది .

సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్'కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎన్.ప్రసాద్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పైడర్'.

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్- వి.వి.వినాయక్ చిత్రం

సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ప్రారంభమైంది.