తార‌క్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి కంపోజింగ్ మొద‌లైంది

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తార‌క్‌కు జోడీగా  పూజా హెగ్డే న‌టించ‌నుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో కనపడనున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన కసరత్తులు కూడా ఎన్టీఆర్ ప్రారంభించారు.

అలాగే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ అద్భుతమైన పాత్రను డిజైన్ చేసారని సమాచారం. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ సినిమాకి తొలిసారి సంగీతమందిస్తున్న తమన్.. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే మ్యూజిక్ కంపోజ్‌ కూడా ప్రారంభించినట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆగష్టు లేదా సెప్టెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. విజ‌య‌ద‌శ‌మి కానుకగా  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి 'ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

More News

ప్ర‌త్యేకమైన స‌న్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.

వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

విక్ట‌రీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.