మహేష్ ను దాటేసిన ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో. రివేజండ్ డ్రామాతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా స్పెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా సినిమాను విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తుంది.

సినిమా బిజినెస్ హాట్ కేక్‌లా జ‌రిగిపోయింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 8.5కోట్ల‌కు అమ్ముడైపోయి సీడెడ్ ఏరియాలోనంద‌మూరి వారి ప్రాభ‌వాన్ని చాటింది. మ‌హేష్ గ‌త చిత్రం శ్రీమంతుడు సీడెడ్‌లో 7.3కోట్ల‌కు మాత్ర‌మే అమ్ముడైంద‌ట‌. అంటే మొత్తం మీద సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ త‌న ప‌ట్టు చూపించడ‌మే కాకుండా బిజినెస్ ప‌రంగా మ‌హేష్‌ను దాటేశాడ‌ట‌.

More News

డిక్టేటర్ కి అంత డిమాండా..

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతుంది.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ,డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.

ఐఫా వేడుకలో అఖిల్ డాన్స్...

ఇండియాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అవార్డ్స్ ఫంక్షన్ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్.

చిరు పై పూరికి కోపం తగ్గలేదు...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్.ఇది కన్ ఫర్మ్ అంటూ స్వయంగా చిరు తనయుడు చరణ్ ప్రకటించారు.

ఇంటర్వెల్ ఎపిసోడ్ బిజీలో బన్ని...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

వరుణ్ కి కలిసొస్తున్నకథలు...

ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.