ఎన్టీఆర్ స్పెష‌ల్ షో.. షాకింగ్‌ రెమ్యున‌రేష‌న్‌..?

  • IndiaGlitz, [Thursday,December 17 2020]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’ చిత్రీకరణలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బిజీగాఉన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు తార‌క్‌. అయితే ఈ గ్యాప్‌లో మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు త‌రహా ప్రోగ్రామ్‌లో తార‌క్ పాల్గొన‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. కాగా.. లేటెస్ట్ స‌మాచారం కోసం ఈ ప్రోగ్రామ్‌లో ఎపిసోడ్‌కు ముప్పై ల‌క్ష‌ల చొప్పున ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ అడిగాడ‌ట‌. ఆ లెక్క‌లో అర‌వై ఎపిసోడ్స్ ఉన్న ఈ ప్రోగ్రామ్‌కు దాదాపు ప‌ద్దెనిమిది కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్స్ అవుతుంది. తెలుగు రియాలిటీ షోలో ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి చేయడం కొత్తేమీ కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తొలి సీజన్‌కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బిగ్‌బాస్ షో సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ హోస్ట్ ఎంతగానో ఉపయోగపడింది. కానీ తర్వాత బిగ్‌బాస్ షో వ్యాఖ్యాతగా నెక్ట్స్ సీజన్స్‌కు పనిచేయలేదు. కానీ ఇప్పుడు మరోసారి వెండితెరతో పాటు బుల్లితెరపై సందడి చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. మరి ఈ షో ఎప్పటి నుండి ఉంటుందో, ఏమో అనే సంగతి తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగక తప్పదు.

More News

ప్రభాస్ ‘ఆదిపురుష్’కి షాక్.. వారిపై కేసు నమోదు

ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ను ప్రకటించిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మోనాల్ రెమ్యూనరేషన్‌పై షాకింగ్ న్యూస్..

బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్ గజ్జర్ రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

ప్రియురాలి కోసం సముద్రాన్నే దాటాడు.. అక్కడే కథ అడ్డం తిరిగింది

ప్రియురాలి కోసం ఏకంగా సముద్రాన్నే దాటాడు.. చివరిగా ప్రియురాలిని కలుసుకున్నాడు.. అంతా బాగుందని ఎంజాయ్ చేస్తూ ప్రియురాలితో కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లాడు.. డామిట్..

మెగాస్టార్ ‘లూసిఫర్’ అప్‌డేట్ వచ్చేసింది

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

సైనికుడిగా విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న లైగ‌ర్ సినిమా సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే.