పంజాబ్‌లో ఎన్టీఆర్ సాంగ్.. వీడియో వైరల్..

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ప్రతీక ‘జై లవకుశ’ చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్‌లో నటించి మెప్పించాడు. మూడు విభిన్నమైన కేరెక్టర్‌లలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఈ చిత్రం లవకుశ పాత్రల కంటే జై పాత్రకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. నెగిటివ్ షేడ్స్‌తో కూడిన ఈ పాత్ర‌లో నత్తిగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. దీంతో యంగ్ టైగర్ కెరీర్‌లోని గుర్తుండిపోయే పాత్రగా జై పాత్ర ఉండిపోయింది.

'జైలవకుశ'లో జై పాత్రను పరిచయం చేస్తూ వచ్చే 'రావణ' పాట కూడా బాగా ఆదరణ పొందింది. దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బాగా ప్రజాదరణ పొందింది. ఆ పాటను పంజాబ్‌లో ఓ ఊరేగింపులో ఉపయోగించారు. ఓ ఊరేగింపు సందర్భంగా రావణ వేషధారి నడుస్తుండగా బ్యాగ్రౌండ్‌లో 'రావణ' పాటను ప్లే చేశారు. ఆ వీడియోను ఎన్టీఆర్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానిని చూసిన దేవీ రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.