రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Monday,July 24 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.రవీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర‌తో పాటు ల‌వ‌, కుశ పాత్ర‌ల్లో కూడా ఎన్టీఆర్ క‌న‌ప‌డ‌నున్నాడు. అందులో భాగంగా పూణేలో జై పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. పూణేలో ఈ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇంత‌కు పూణేలో ఎందుకు చిత్రీక‌రిస్తున్నారంటే పూణేలోనే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో జ‌రుగుతుంది కాబ‌ట్టి.

ఇక జై క్యారెక్ట‌ర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌. నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయి. స‌రే..ఇంత‌కు ఎన్టీఆర్ ఏ రాజకీయ పార్టీకి చెందిన‌వాడు. అంటే స‌మస‌మాజ్ పార్టీ. త‌న పార్టీ త‌ర‌పున జై ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతున్న‌ట్లు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు మ‌రి. 'జై ల‌వ‌కుశ‌' సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సినిమాను నిర్మిస్తున్నాడు.

More News

సమంత కండీషన్స్ పెట్టింది...

ఒకప్పుడు పరభాషా హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ.ఈరోజుల్లో దిగుమతి అయ్యే హీరోయిన్లకు డిమాండ్ కాస్త ఎక్కువే.

కత్రినా ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

సినిమా సెలబ్రిటీస్,ముఖ్యంగా హీరోయిన్లు ఏం చేసినా విడ్డూరమే.నిలబడినా,కూర్చున్నా,నవ్వినా,ఏడ్చినా..

ఇదేం దెయ్యం ఆడియో ఆవిష్కరణ

ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయనంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'.శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు.

డార్క్ కామెడి చిత్రంలో...

అందాల నాయిక నయనతార ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజి బిజీగా ఉంది.

శ్రుతి కోరిక తీరింది...

కమల్ తనయ శ్రుతి హాసన్ ఓ షూటింగ్ చిత్రీకరణ కోసం చండిగఢ్ వెళ్లింది.