ప్ర‌త్యేకమైన స‌న్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్‌

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. 'యన్.టి.ఆర్'. టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నంద‌మూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నిర్మాత కాగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 29న పూజా కార్యక్రమాలు జరిపి.. ఆ తర్వాత లాంఛ‌నంగా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఆ ఒక్క రోజు షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నారని సమాచారం. 1940లలో సర్వీస్ కమిషన్ ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఎన్టీఆర్ మద్రాసు నగరానికి రావడం.. ఆ తర్వాత నటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వైనాన్ని తెలిపే సన్నివేశాన్ని ఆ రోజు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ తర్వాత షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చి.. వేసవి తర్వాత అంటే ఆగష్టు నుంచి నిరవధికంగా చిత్రీకరణను జరిపే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.

వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

విక్ట‌రీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం -నిర్మాత‌లు

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో