ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చేసింది..!

  • IndiaGlitz, [Friday,May 20 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పూరి జ‌గ‌న్నాథ్ క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్ద‌రికీ ఒకే రోజు క‌థ‌లు చెప్పి ఒప్పించారు. క‌ళ్యాణ్ రామ్ తో పూరి సినిమా ప్రారంభించాడు. ఈ సినిమా త‌ర్వాత పూరి ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అలాగే ఎన్టీఆర్ రైట‌ర్ వ‌క్కంతం వంశీతో ఓ సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత పూరి తో సినిమా చేస్తాడా..? లేక వ‌క్కంతం వంశీతో సినిమా చేస్తాడా అనే సందేహం ఉండేది. ఈరోజు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ పై క్లారిటీ వ‌చ్చేసింది.

అది ఎలా ఉంటే...క‌ళ్యాణ్ రామ్ సోద‌రుడు ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో...హ్యాపీ బ‌ర్త్ డే నాన్నా అంటూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. అందులో ఎన్టీఆర్ ఫోటోతో పాటు నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ లో 9వ చిత్రం..ఎన్టీఆర్ కి 27వ చిత్రం ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌. వక్కంతం వంశీ డైరెక్ట‌ర్ అని ఉంది. నాన్న‌కు ప్రేమ‌తో..ఎన్టీఆర్ 25వ చిత్రం, జ‌న‌తా గ్యారేజ్ 26వ చిత్రం. సో...జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా వ‌క్కంతం వంశీ తోనే అని క్లారిటీ వ‌చ్చేసింది.

More News

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడో సిరీస్ ముగింపు..

ఎక్క‌డో మారుమూల ప‌ల్లెటూరిలో ఉన్న ఒక సామాన్యుడు కూడా త‌న క‌ల‌ల్నీ ఆశ‌ల్నీ నిజం చేసుకునే అద్భుత అవ‌కాశం క‌ల్పించిన  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడో సిరీస్ ఈనెల‌ 22న (ఆదివారం  ఎపిసోడ్ తో) ముగుస్తోంది.

హ్యాపీ బర్త్ డే టు రాకింగ్ స్టార్ మంచు మనోజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.

సూర్య త‌దుప‌రి చిత్రం ద‌ర్శ‌కుడు ఇత‌డే..

సూర్య ప్ర‌స్తుతం సింగం, సింగం 2 చిత్రాల సీక్వెల్ సింగం 3 లో న‌టిస్తున్నారు.  సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.

హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న సంజీవని

హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో విభిన్న కథాంశం తో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హిమాలయాలు, రోటాంగ్, మనాలి, నల్లమల తదితర లొకేషన్లలో చాలా సాహసోపేతంగా చిత్రీకరించబడింది.