గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసినీ క్రియేష‌న్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. నెలాఖరు వరకు సాగే ఈ చిత్రీకరణలో భాగంగా యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మే 2 నుంచి మే 18 వరకు రెండో షెడ్యూల్‌ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి.. రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమకు చెందిన ఒక విలేజ్‌ సెట్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ విలేజ్‌ సెట్‌లో రెండో షెడ్యూల్‌కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ కల్లా చిత్రీకరణను పూర్తి చేసి.. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాణ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.