ఎన్టీఆర్ గ్యారేజ్ కి నో చెప్పిన ప్రభుదేవా..

  • IndiaGlitz, [Wednesday,March 02 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసాడ‌ట‌.
అయితే దేవిశ్రీ ట్యూన్స్ కి ప్ర‌భుదేవా స్టెప్స్ క‌లిస్తే సాంగ్ అదిరిపోతుంద‌నేది ఎన్టీఆర్ ఆలోచ‌న‌. ఈ విష‌యాన్ని ప్ర‌భుదేవాకి చెబితే...నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రాల‌కు తప్ప బ‌య‌ట చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ అందించ‌డం లేదంటూ నో చెప్పేసాడ‌ట‌. దీంతో ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించే బాధ్య‌త‌ను ప్ర‌భుదేవా సోద‌రుడు రాజు సుంద‌రంకు అప్ప‌చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను ముంబైలో చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అది సంగ‌తి.

More News

పెళ్లి చేసుకుంటున్నఎన్టీఆర్ హీరోయిన్..

అవును...ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది.ఇంతకీ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా..?

ఉదయానిథి స్టాలిన్ - నయన తారల 'గుడ్ ఈవెనింగ్'

తమిళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న "నంబేండా" చిత్రాన్ని తెలుగులో "గుడ్ ఈవెనింగ్" పేరుతో డబ్ చేశారు భద్రా కాళీ ఫిలిమ్స్ వారు.

ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా నేను రెడీ - రేష్మి

జ‌బ‌ర్థ‌స్త్ పొగ్రామ్ తో బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ రేష్మి. ఇప్పుడు హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతూ రేష్మి న‌టించిన చిత్రం గుంటూరు టాకీస్.

నిజంగానే డిఫ‌రెంట్ మూవీ శౌర్య - మ‌నోజ్

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించిన చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ‌కుమార్ నిర్మించారు. థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన శౌర్య ఈనెల  4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

బొలివియాకు బన్ని...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.