రాజ‌మండ్రి వెళుతున్న యంగ్ టైగ‌ర్..!

  • IndiaGlitz, [Wednesday,December 21 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత...త‌దుప‌రి చిత్రం చేసేందుకు కొంచెం టైమ్ తీసుకుని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేసారు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈనెల 23న ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫంక్ష‌న్ కు హాజ‌ర‌య్యేందుకు రాజ‌మండ్రి వెళుతున్నారు.

హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి ఫ్లైట్ లో వ‌చ్చి అక్క‌డ నుంచి కాకినాడ‌కు కారులో వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.ఎన్టీఆర్ 23న కాకినాడ‌లోనే ఉండి 24 ఫంక్ష‌న్ కు హ‌జ‌ర‌వుతార‌ట‌. ఎన్టీఆర్ తో పాటు క‌ళ్యాణ్ రామ్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజ‌మండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కు ఘ‌న స్వాగ‌తం చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నారు.