మ‌రోసారి వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్

  • IndiaGlitz, [Saturday,December 12 2020]

సీనియ‌ర్ అగ్ర హీరోల్లో చిరంజీవి, నాగార్జున వెండితెర‌పైనే కాదు.. బుల్లితెర‌పై కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌తో సందడి చేస్తే.. నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడితోపాటు బిగ్‌బాస్‌ను కూడా హోస్ట్ చేశారు. ఇప్ప‌టికీ నాగ్‌.. బిగ్‌బాస్ వ్యాఖ్యాత‌గానే ఉన్నారు. ఇక నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేసింది ఎన్టీఆర్ మాత్ర‌మే. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు ఆయ‌నే హోస్ట్‌. ఆ సీజ‌న్‌కు చాలా హైప్ తీసుకురావ‌డంలో ఎన్టీఆర్ చాలా కీల‌క పాత్ర పోషించారు. అయితే త‌దుప‌రి కొన్ని కార‌ణాల‌తో ఎన్టీఆర్ బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయ‌లేదు. అయితే మ‌రోసారి ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆయ‌న బిగ్‌బాస్‌లో హోస్టింగ్ చేయ‌డం లేదట‌. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ.. ఓ స్పెష‌ల్ షోను ప్లాన్ చేసింద‌ట‌. దానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్, ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌నున్నారు.

More News

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ బచ్చన్‌–అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లోని ‘మే డే’

బిగ్‌ బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. దీనికి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ దర్శకుడు,

అజయ్.. శ్రద్ధా దాస్.. ఆమని ప్రధాన తారలుగా సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం' 

అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత.

రకుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్‌ హీరోయిన్‌కు రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు టీవీ ఛానెళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

'పుష్ప' కోసం ప్లాన్‌ మార్చిన బన్నీ అండ్‌ టీమ్‌

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ వెయిటింగ్‌ ఉండి దాదాపు ఏడాది కావస్తుంది.

'సోలో బ్రతుకే సో బెటర్‌' టైటిల్‌ ట్రాక్‌ విడుదల

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో