యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా, కావ్యాథాప‌ర్ క‌థానాయ‌కిగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.

ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొదుతోన్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. ఈ నెల 28న ఆడియో విడుద‌ల కానుంది. ఈ వేడుక‌కి యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.