ఎన్టీఆర్ 'బృందావ‌నం'కి ఐదేండ్లు

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

'సిటీ నుంచి వ‌చ్చాడు. సాఫ్ట్‌గా ల‌వ‌ర్ బోయ్‌లా ఉన్నాడు క‌దా అనుకోవ‌ద్దు. ఏదో కొత్త క్యారెక్ట‌ర్ కోసం ట్రై చేశా. లోప‌ల మాత్రం అంతా అదే. ఆ లోప‌ల ఉన్న‌దాన్ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చావో..ర‌చ్చ రచ్చే..' అంటూ ఎన్టీఆర్ సంద‌డి చేసిన చిత్రం 'బృందావ‌నం'. మాస్‌, క్లాస్‌..ఇలా రెండు వ‌ర్గాల ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న ఈ సినిమా తార‌క్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది.

వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా కోసం తార‌క్ స‌ర‌స‌న కాజ‌ల్‌, స‌మంత తొలిసారిగా జ‌ట్టుక‌ట్టారు. ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీ‌హ‌రి, కోట శ్రీ‌నివాస‌రావు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్.ఎస్‌.థ‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లోని పాట‌లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. 2010లో అక్టోబ‌ర్ 14న అంటే స‌రిగ్గా ఐదేళ్ల క్రితం విడుద‌లైన 'బృందావ‌నం' ఎన్టీఆర్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది.

More News

గుణ శేఖ‌ర్ కి నిర్మాత దొరికాడు

గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. అనుష్క టైటిల్ రోల్ పోషించిన రుద్ర‌మ‌దేవి

ర‌వితేజ మూవీ టైటిల్ మ‌ళ్లీ మారిందా..?

మాస్ మ‌హా రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్నారు.

చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ బాలీవుడ్ హీరో..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ సినిమా త‌ర్వాత త‌మిళ్ సినిమా త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మల్టీస్టారర్ లో రేయ్ భామ

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం ‘రేయ్’ విడుదల్లో జాప్యం జరిగి రెండో చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సయామీ ఖేర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.

బ్ర‌హ్మోత్స‌వం ఊటీ షెడ్యూల్ మారిందా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణిత న‌టిస్తున్నారు.