య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా య‌న్‌.టి.ఆర్ పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమా  ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యింది కూడా.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ద‌ర్శ‌కుడు తేజ బ‌య‌టికి రావ‌డంతో.. ఈ బ‌యోపిక్‌కు ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అనేదానిపై ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి బాల‌య్య‌తో రైతు సినిమా తీయాల‌ని గ‌తంలో కృష్ణ‌వంశీ.. స‌ద‌రు నందమూరి క‌థానాయ‌కుడిని సంప్ర‌దించారు.

చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైనా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. య‌న్‌.టి.ఆర్ చిత్రానికి కృష్ణ‌వంశీ పేరు మ‌ళ్ళీ వెలుగులోకి రావ‌డం విశేషం. కృష్ణ‌వంశీ ఎంట్రీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. అన్న‌ట్టు.. బాల‌కృష్ణ స్వ‌యంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసే దిశ‌గా ఆలోచిస్తున్నారని కూడా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

More News

మూడో గేర్ లో డ్రైవర్ రాముడు

శకలక శంకర్... తాను తెర మీద కనపడగానే థియేటర్ మొత్తం నవుళ్ళతో నిండిపోతుంది. ఇలా  నవ్వులతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు.

కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి 'వైఫ్ ఆఫ్ రామ్' టీజర్

ఇన్నోవేటివ్  థాట్స్ ను ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టైల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు.

'సడి' షూటింగ్‌ ప్రారంభం

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌- `శ్రీ సాయి అమృతల‌క్ష్మి క్రియేషన్స్ బేన‌ర్స్ పై గోదారి భానుచంద‌ర్  నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’.

జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న'సాక్ష్యం'

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం'.

'నీతోనే హాయ్‌..హాయ్‌' తొలి షెడ్యూల్ పూర్తి!!

కెఎస్‌పి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై  య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో   డా.ఎ.స్. కీర్తి, డా.జి.పార్థ‌సార‌థి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'నీతోనే హాయ్ హాయ్‌'. బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌కుడు.