రెండు భాగాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌....

  • IndiaGlitz, [Monday,October 01 2018]

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను రెండు భాగాలుగా తెరెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ బయోపిక్ చిత్రీక‌ర‌ణ తుది దశ‌కు చేరుకుంటుంది. నిన్న‌టి వ‌ర‌కు కేవలం ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌డం వ‌ర‌కే సినిమాగా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడు అది రెండు భాగాలుగా తీయ‌డానికి క్రిష్‌, బాల‌కృష్ణ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి రెండు భాగాలుగా తీస్తే ఏ భాగం ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నే దానిపై ఇంకా అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు లేరు. ఒక భాగం అయితే జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. మ‌రి రెండో భాగం ఉంటే అది ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్య‌బాల‌న్‌, రానా, సుమంత్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, జిస్నేన్ గుప్తా, మంజిమ మోహ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

More News

'కర్త కర్మ క్రియ' టీజర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో

సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది...

రీసెంట్‌గా బాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ స్టార్ట‌య్యింది. ఇప్పుడు మ‌రో బాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ ప‌త‌క విజేత పి.వి.సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది.

మరో అడుగు మార్పుకోసం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంఛ్

సమాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదుగా వస్తాయి. అంటువంటి అరుదైన చిత్రమే 'మరో అడుగు మార్పుకోసం'.

మ‌హేశ్ మంచి మ‌న‌సు...

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కేవ‌లం సినిమాల‌కో.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కో ప‌రిమితం కాదు. ఆయ‌న స్టార్ డ‌మ్ వెనుక పెద్ద మ‌న‌సుంది.

'నోటా' పబ్లిక్ మీట్..!!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ' నోటా' అక్టోబర్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు..