కాకినాడ ద‌గ్గ‌ర వేలంగిలో సంద‌డి చేసిన ఎన్టీఆర్..!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నిన్న హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వెళ్లి అక్క‌డ నుంచి కాకినాడ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో పాల్గొనేందుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈరోజు కాకినాడ ద‌గ్గ‌ర‌లోని వేలంగిలో జ‌రిగిన ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. వేలంగిలో జ‌రిగిన ఎన్టీఆర్ అన్న దివంగ‌త జాన‌కిరామ్ కుమారుల‌కు పంచె క‌ట్టు ఫంక్ష‌న్ కు ఎన్టీఆర్ స‌తీస‌మేతంగా హాజ‌ర‌య్యారు.

ఎన్టీఆర్ దంప‌తుల‌తో పాటు తండ్రి హ‌రికృష్ణ దంప‌తులు, క‌ళ్యాణ్ రామ్ దంప‌తులు కూడా హాజ‌ర‌య్యారు. హ‌రికృష్ణ వియ్యంకుడు ప్ర‌భాక‌ర‌రావు ఇంటి వ‌ద్ద జాన‌కిరామ్ కుమారులు నంద‌మూరి తార‌క‌రామారావు, సౌమిత్ర ప్ర‌భాక‌ర్ ల పంచెక‌ట్టు కార్య‌క్ర‌మం వేద‌పండితుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.