ఎన్టీఆర్ 'ఆది' కి 14 ఏళ్లు

  • IndiaGlitz, [Monday,March 28 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం 'ఆది'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కూడా ఇదే. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న నంద‌మూరి అభిమానులనే కాదు.. తెలుగు సినిమా ప్రియుల‌ను అల‌రించింది.

'అమ్మ తోడు.. అడ్డంగా న‌రికేస్తా..' అంటూ ఎన్టీఆర్ ప‌లికే సంభాష‌ణ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. మ‌ణిశ‌ర్మ‌ సంగీత‌మందించిన ఈ చిత్రంలోని పాట‌లు ఆద‌ర‌ణ పొందాయి. కీర్తి చావ్లా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా రూ.2 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది.. దాదాపు రూ.20 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. 121 కేంద్రాల్లో 50 రోజులు.. 96 కేంద్రాల్లో 100 రోజులు.. 3 కేంద్రాల్లో 175 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన 'ఆది' చిత్రం విడుద‌లై నేటితో (మార్చి 28)కి 14 సంవ‌త్స‌రాలు.

More News

ఉగాదిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..

తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది. ఈ ప‌ర్వ‌దినాన సాధార‌ణంగా కొత్త‌ప‌నులు ప్రారంభిస్తుంటారు. ఇక మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో అయితే కొత్త సినిమాలు ప్రారంభించ‌డం...ఆడియో రిలీజ్ చేయ‌డం...సినిమా రిలీజ్ చేయ‌డం చేస్తుంటారు.ఈసారి కూడా  స్టార్ హీరోలు ఉగాదిని టార్గెట్ చేస్తున్నారు. ఇంత‌కీ ఉగాది రోజున స్టార్ హీరోలు ఏం చేయ‌నున్నార‌నుకుంట&

జాతీయ అవార్డ్ కోసం కంచె తో పోటీపడిన తెలుగు చిత్రాలివే

వరుణ్ తేజ్-ప్రగ్యాజైస్వాల్ జంటగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె.

ఏప్రిల్ 1న 'అప్పుడలా ఇప్పుడిలా' విడుదల

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు.

క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె.