అర్థరాత్రి స్టైలిష్‌గా వచ్చి సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్

  • IndiaGlitz, [Thursday,May 20 2021]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్ అర్థరాత్రే వచ్చేసింది. సక్సెస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరోసారి యంగ్ టైగర్ చేయబోతున్నాడంటూ ఎప్పటి నుంచో వార్తలు వినవస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా కూడా అనౌన్స్ అయ్యింది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారక్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది.

ఇదీ చదవండి: RRR: కొమరం భీం గురిపెడితే గుండెల్లో దిగాల్సిందే

ఇవాళ తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 టీమ్‌ ఒక స్టైలిష్ ఫోటోని షేర్‌ చేసింది. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ లుక్‌తో ఇన్‌షర్ట్‌ చేసుకుని చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ క్రితమే ఎన్టీఆర్, కొరటాల కాంబో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వీరిద్దరూ వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోందని ఇప్పటికే కొరటాల శివ వెల్లడించారు.

పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో కొరటాల భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే, తారక్‌ తన 30వ చిత్రాన్ని మొదట త్రివిక్రమ్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతానికి పక్కనబెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో తారక్ కనిపించనున్నాడు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

More News

'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీలో రాజమౌళి తగ్గేది లే!

ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌తో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. రాజమౌళి మనసు మారలేదు.

ఇకపై 10 గంటలు దాటితే రోడ్లపైకి వచ్చారో..

కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని.. కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

గాలి ద్వారా కరోనా.. ఇలా చెక్ పెట్టవచ్చు..

గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ అంతం ఎప్పుడంటే...

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి దాదాపు ఏడాది పాటు పట్టి పీడించింది. కరోనా మహమ్మారి ఇక అంతమైనట్టే అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ ప్రారంభమై..

RRR: కొమరం భీం గురిపెడితే గుండెల్లో దిగాల్సిందే

జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొమరం భీం లుక్ విడుదల చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న లుక్ విడుదల