నాగ‌చైత‌న్య కాదు.. సుమంత్‌

  • IndiaGlitz, [Thursday,June 28 2018]

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. య‌న్‌.టి.ఆర్ పేరుతో రూపొందుతున్న ఈ బ‌యోపిక్‌లో ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వారిలో నాగ‌చైత‌న్య కూడా ఉన్నారు. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో చైతూ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. ఇప్ప‌టికే మ‌హాన‌టిలో ఆ పాత్ర చేయ‌డం వ‌ల్ల‌.. ఫ్రెష్‌నెస్ ఉండ‌ద‌నే ఉద్దేశంతో.. అదే కుటుంబానికి చెందిన సుమంత్‌ను న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. సుమంత్‌లో ఏఎన్నార్ పోలిక‌లు ఎక్కువ‌గా ఉండ‌డం కూడా ఓ కార‌ణ‌మేన‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. సుమంత్ ఎంట్రీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. కాగా.. జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుద‌ల కానుంది.

More News

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న '@నర్తన శాల'

'ఛలో' ఘ‌న‌విజయం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత నిర్మాణ సంస్థ‌లో చేసిన ఈ చిత్రం భారీ లాభాల‌నే మూట‌గ‌ట్టుకుంది.

చివ‌రి షెడ్యూల్ లో 'ఆయుష్మాన్ భవ' న‌వంబ‌ర్ 9న విడుద‌ల‌

నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌.

నాచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా 'కురుక్షేత్రం' ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే  యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు.

య‌స్‌.వి.ఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న‌

వెండితెర విల‌క్ష‌ణ న‌టుడు య‌స్‌.వి.ఆర్‌. శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న జ‌ర‌గ‌నున్నాయ‌ని 'సంగ‌మం ఫౌండేష‌న్ సంస్థ అధ్య‌క్షులు, సినీ ప‌రిశోధ‌కులు సంజ‌య్ కిశోర్ తెలిపారు.

'పంతం' ప్రీ-రిలీజ్ వేడుక డిటైల్స్‌..

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, పంజాబి ముద్దుగుమ్మ‌ మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'పంతం'.