Nomination:ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.

రాష్ట్రం మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది, పాలేరు నియోజకవర్గంలో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల పోటీలో నిలబడ్డారు. ఇక అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట్ నియోజకవర్గాల్లో 7 మంది బరిలో నిలిచారు. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 28న ప్రచారం ముగియనుండగా.. నవంబర్ 30వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ పోటీ చేస్తు్న్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలపైనే తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఉంది. ఎందుకంటే తొలిసారిగా కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. అలాగే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిలబడటం... కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ నువ్వానేనా అన్నట్లు పోరు కొనసాగుతోంది. కేసీఆర్ రెండు స్థానాల్లో గెలుపొందుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. రెండు చోట్ల ఓడిపోతారని కాంగ్రెస్, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు సీట్లలో పోరు రసవత్తరంగా మారింది.

More News

Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్..!

పవర్ స్టార్ అభిమానులకు కొంత బ్యాడ్ న్యూస్ లాంటి వార్త ఇది. ఇటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ బిజీగా ఉన్నారు.

Balakrishna:ఇక యుద్ధం మొదలైంది.. పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ ప్రశంసలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడే మనుషులమని తెలిపారు.

Vijayashanthi:బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ..?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా..

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌కు రతిక మరో వెన్నుపోటు .. అర్జున్ మాటలకు శోభ కంటతడి, ‘‘ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ’’లో ట్విస్టులు

బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ రచ్చ నడవగా..

Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య.. ఏపీ హైకోర్టుకు వైద్యుల నివేదిక..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టుకు ఆయన తరపు న్యాయవాదులు నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.