TRAI :ఇకపై స్పామ్ కాల్స్, సందేశాలకు చెక్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు స్పామ్ కాల్స్, మెసేజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత అసహనానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నుంచి వాటికి చెక్ పడనుంది. ఈ మేరకు టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ(TRAI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రమోషనల్‌ సందేశాలు పంపించాలంటే ముందుగా యూజర్‌ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏజెన్సీ యూజర్‌కు కంటెంట్ పంపించాలీ అంటే.. ముందుగా టెలికాం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాలి.

అనంతరం సదరు టెలికాం ఆపరేటర్‌ మీకు ఓ కోడ్‌తో కూడిన సందేశం పంపిస్తుంది. మీరు అనుమతి ఇస్తే మీకు కాల్స్, సందేశాలు వస్తాయి. లేదంటే నిరాకరించవచ్చు. మీరు అనుమతికి నిరాకరిస్తే టెలికాం కంపెనీ ఆ ఏజెన్సీని ఇకపై సందేశాలు పంపకుండా నిలువరించాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషనల్‌ సందేశాలకు ఇచ్చిన అనుమతులను ఎప్పుడైనా సులువుగా ఉపసంహరించుకునేందుకు వీలుగా ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సిద్ధం చేసుకోవాలని ట్రాయ్‌ సూచించింది.

తొలుత స్పామ్‌ సందేశాలను అరికట్టాలని భావిస్తోంది. తర్వాత కాల్స్‌కూ దీన్ని విస్తరించనుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే ఈ నోటిఫికేషన్‌కు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుబాటు కావని స్పష్టంచేసింది. ప్రమోషనల్‌ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ(DCA) పేరిట ఓ ప్రోగ్రామ్‌ను ఇటీవల ట్రాయ్‌ తీసుకొచ్చింది.

More News

CM KCR:అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా: సీఎం కేసీఆర్

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తనను చాలా సార్లు కోరారని అందుకే పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

Achchennaidu:త్వరలోనే టీడీపీ-జనసేన మేనిఫెస్టో ఖరారుచేస్తాం: అచ్చెన్నాయుడు

ఈనెల 17 నుంచి టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతాయని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Mogalirekulu Sagar:జనసేన ప్రచార కార్యదర్శిగా 'మొగలిరేకులు' సాగర్ నియామకం

ఇటీవల జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ ములుకుంట్ల సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో

Pindam: అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'పిండం' పాట విడుదల

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

Sapta Saagaralu Daati: 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది: చిత్ర బృందం

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'సప్త సాగరాలు దాటి సైడ్ ఎ' విశేష ఆదరణ పొందింది. దీంతో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.