“శాకిని- ఢాకిని” గా నివేదా రెజీనా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..!!

  • IndiaGlitz, [Wednesday,November 03 2021]

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్‌ సినిమాలో తన ఫెర్ఫామెన్స్‏తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నివేదా థామస్‌. తాజాగా ఈ అమ్మడు తనలోని మరో షేడ్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ఓ కొరియన్‌ రిమేక్‌తో మన ముందుకు రాబోతోంది. అయితే ఈ అమ్మాయి ఒక్కతే కాదు.. జంటగా సీనియర్ హీరోయిన్ రెజీనాను కూడా వెంట తీసుకువస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నివేదా థామస్‌, రెజీనా లీడ్ రోల్స్‌లో దర్శకుడు సుధీర్‌ వర్మ ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రాన్ని రిమేక్‌ చేస్తున్నాడు. కొరియన్ మాతృకలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయించారు దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నివేదా థామస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ విషయాన్ని అఫిషీయల్‌గా అనౌన్స్ చేశాడు.

పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికర్స్ ముఠాలతో తలపడాల్సి వస్తుంది. ఈ గ్యాంగ్స్ నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. పూర్తి యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నివేదా- రెజినా క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్‌. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ‘‘శాకిని- డాకిని’’ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

More News

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న "భగత్ సింగ్ నగర్" చిత్రం 

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో

త్రివిక్రమ్ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా - మాటల రచయిత గణేష్ రావూరి

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ-సిరిల మధ్య రగడ, షన్నూ తప్పించి.. హౌస్‌మేట్స్‌ మొత్తం నామినేషన్స్‌లోకి

బిగ్‌బాస్ 5 తెలుగులో సోమవారం ఎపిసోడ్ హాట్‌హాట్‌గా సాగింది. నామినేషన్స్ డే కావడంతో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు, విమర్శలు, గొడవలు జరిగాయి.

బద్వేల్‌లో వైసీపీ ఘన విజయం.. భారీ మెజార్టీ, కనుచూపు మేరలో కనిపించని విపక్షాలు

అనుకున్నదే జరిగింది.. బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : 50 కోట్ల క్లబ్‌లోకి అఖిల్.. వరల్డ్ వైడ్‌గా కుమ్మేస్తోన్న వసూళ్లు

ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్‌కు ఆ కరువు తీర్చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ , పూజా హెగ్డే