‘నివర్’గప్పుతున్న తుపాను.. 26 వరకూ భారీ వర్షాలు..

  • IndiaGlitz, [Monday,November 23 2020]

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కాగా.. ఇది 24 గంటల లోపు తుపానుగా మారే అవకాశముందని ప్రకటించింది. ఈ తుపానుకు ‘నివర్’ అనే పేరు పెట్టనున్నారు. కాగా.. తుపానుగా మారిన అనంతరం ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరి తీరాన కరైకల్‌, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

కాగా.. ఈ తుపానుకు ‘నివర్’ అనే పేరును ఇరాన్ దేశం సూచించింది. దీని కారణంగా 25, 26 తేదీల్లో ఏపీలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్ప పీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ‘గతి’ తీవ్ర తుపాను కొనసాగుతుండగా.. తాజాగా బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా.. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం నుంచి.. ఇక బుధవారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదివారం నుంచే హెచ్చరికలు జారీచేశారు. ఈ తుపాను ప్రభావం ఈ నెల 26 వరకూ కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

More News

కన్నీటి పర్యంతమైన రానా దగ్గుబాటి

అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమానికి అతిథిగా రానా దగ్గుబాటి హాజరయ్యాడు.

సముద్రంలో స‌మంత సాహ‌సం

స‌మంత అక్కినేని.. పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంది. కానీ, గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు స‌రిక‌దా..

స్టార్ హీరోతో తరుణ్ భాస్కర్

‘పెళ్లిచూపులు, ఈన‌గ‌రానికిఏమైంది’ చిత్రాల త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు.

‘క్రాక్’ సినిమాకు లీగ‌ల్ స‌మ‌స్య‌..!

ర‌వితేజ, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క్రాక్’.

బోర్ కొట్టించిన సండే.. లాస్య ఎలిమినేట్..

సండే.. ఫన్‌డే.. లాస్య ఎలిమినేషన్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. బోర్ కొట్టించే ఫన్ తప్ప..