నితిన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

యువ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన అ ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి నితిన్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అ ఆ ఇచ్చిన బిగ్ స‌క్సెస్ ను కంటిన్యూ చేసేలా మంచి ప్రాజెక్ట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన నితిన్ నెక్ట్స్ మూవీని అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించ‌నుంది. అస‌లు...హ‌ను రాఘ‌వ‌పూడి అఖిల్ తో సినిమా చేయాలి. క‌థ చెప్ప‌డం అఖిల్ ఓకే అన‌డం కూడా జ‌రిగిపోయింది కానీ...ఈ చిత్రాన్ని ఏ బ్యాన‌ర్ లో చేయాలి అనే విష‌యంలో ఇద్ద‌రికి ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు అదే క‌థ‌తో నితిన్ తో మూవీ చేయ‌నున్నాడు హ‌ను. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు.

More News

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి మ్యూజిక్ అందించేది ఇత‌నే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ పెళ్లి కార‌ణం బ్రేక్ ప‌డిన షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

సునిల్ కెరీర్లోనే పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందించిన ప్రేక్షక దేవళ్ళకి మా ధన్యవాదాలు : నిర్మాత ఆర్ . సుదర్శన్ రెడ్డి

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా జంటగా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం జులై 29న విడుదలయ్యింది.

ఆస్కార్ రేసులో 'రుద్ర‌మ‌దేవి'

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌గా గుణా టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన హిస్టారిక‌ల్ త్రీడీ చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డిగా అల్లుఅర్జున్‌, చాళుక్య వీర‌భద్రుడుగా రానా న‌టించారు.

భారీ రేటుకు 'మ‌నమంతా' శాటిలైట్ హ‌క్కులు

మోహ‌న్ లాల్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో విశ్వాంత్‌, రైనారావులు తారాగ‌ణంగా విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం మ‌నమంతా. ఇటు ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా నిలిచింది.

రాజ‌శేఖ‌ర్‌తో క‌మ‌ల్ హీరోయిన్‌

గ‌డ్డం గ్యాంగ్ త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో న‌టించ‌నున్నాడు.