మ‌ళ్లీ బిజీ అవుతున్న నిత్యా

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

నిత్యా మీన‌న్‌.. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌క్షిణాది హీరోయిన్ పేరిది. సౌత్ లోని నాలుగు భాష‌ల్లోనూ న‌టిగా త‌న ప్ర‌తిభ‌ని చాటిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.

అలా మొద‌లైంది, ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంతయ్యిందే, మ‌ళ్ళి మ‌ళ్ళీ ఇది రాని రోజు చిత్రాల‌తో న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న నిత్యా.. గ‌తేడాది విడుద‌లైన జ‌న‌తా గ్యారేజ్ త‌రువాత మ‌ళ్లీ తెలుగు చిత్రాల‌తో సంద‌డి చేయ‌లేదు.

ఈ మ‌ధ్య అదిరింది అనే త‌మిళ డ‌బ్బింగ్ చిత్రంతో మ‌రోసారి ప‌ల‌క‌రించిన నిత్యా.. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగు చిత్రాల‌పై దృష్టి పెట్టింది. త‌న తొలి తెలుగు క‌థానాయ‌కుడు నాని నిర్మిస్తున్న అ!లో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ కేర‌ళ‌కుట్టి.. మ‌రోసారి శ‌ర్వానంద్‌కి జోడీగా న‌టించేందుకు సిద్ధ‌మైంది.

అలాగే వెంక‌టేష్ తో తేజ రూపొందించ‌నున్న చిత్రంలోనూ నిత్యానే హీరోయిన్ గా న‌టించే అవ‌కాశముంద‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్త‌మ్మీద‌.. మ‌ళ్లీ టాలీవుడ్‌లో నిత్యా బిజీ కానుంద‌న్న‌మాట‌.

More News

'సాహో' బిజినెస్‌.. టాలీవుడ్ టాక్‌

ప్రభాస్ హీరోగా  తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైన‌ర్  'సాహో'.  శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా న‌టిస్తున్నాడు.

మోహన్ బాబు 'గాయత్రీ' షూటింగ్ లో విష్ణు మంచు, శ్రియ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రీ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది.

జవాన్ ప్రీ రిలీజ్ టూర్ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సప్తగిరి ఎల్ ఎల్ బి' పెద్ద హిట్ అవుతుంది - రామ్ చరణ్

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్బి'.

భారత్ వరల్డ్ రికార్డ్స్ లో గణేష్ మాస్టర్

ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డ్ గ్రహీత, భారత్ ఆర్ట్స్ అకాడెమీ ద్వారా గబ్బర్ సింగ్ అవార్డును గణేష్  మాస్టరు అందుకొన్నారు.