కొత్త సినిమాను షురూ చేసిన నితిన్‌

  • IndiaGlitz, [Monday,December 07 2020]

ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్‌ హిట్‌ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భీష్మ తర్వాత ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్‌ చేసి స్టార్ట్‌ కూడా చేసేశాడు. అంతా సవ్యంగా వెళుతుందనుకుంటున్న సమయంలో కరోనా వైరస్‌ ప్రభావం ప్రారంభం కావడంతో అన్నీ సినిమాల షూటింగ్స్‌ ఆరేడు నెలల పాటు ఆగాయి. నితిన్‌ సినిమాల విషయానికి వస్తే నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రంగ్‌ దే' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అలాగే మరోవైపు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో నితిన్‌, రకుల్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమా చెక్.. ఇది ఎనబై శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఈ రెండు సినిమాలను పూర్తి చేయకుండా నితిన్‌ తన కొత్త సినిమాను దుబాయ్‌లో స్టార్ట్‌ చేశాడు. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీ అంధాదున్‌, తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను నితిన్‌ దుబాయ్‌లో స్టార్ట్‌ చేశాడు. ఈ విషయాన్ని నితిన్‌ తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా తెలియజేశాడు. ఇందులో తమన్నా, నభానటేశ్ నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక్కడే నితిన్‌ తన రంగ్‌ దే సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.

More News

ప్లాన్‌ మార్చుకున్న 'సర్కారు వారిపాట'

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'.

రష్మికను రీప్లేస్‌ చేయనున్న రాశీఖన్నా..

ప్రస్తుతం దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న..

అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం పక్కా అయ్యింది.

క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరణలో 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2'

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో విడుదల కావాల్సిన ప్యాన్‌ ఇండియా మూవీ 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2' .. కరోనా వైరస్‌ దెబ్బకు ఆగింది.

రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన దర్శకుడు

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా 'ఆర్‌.ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుండి ప్రారంభమైంది.