నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. ఆ చిత్రాలే 'దిల్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే'.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ న‌టించిన 'దిల్' (2003) చిత్రం ఏప్రిల్ 4న విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే.. విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించిన‌ 'గుండె జారి గల్లంతయ్యిందే' (2013)  కూడా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.

ఇలా  ఏప్రిల్ నెలలో రెండు విజయాలను అందుకున్న నితిన్..  తాజాగా త‌నకు అచ్చొచ్చిన నెల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి 'ఛల్ మోహన్ రంగ' అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. కామెడీ ప్ర‌ధానంగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ ఏప్రిల్ 5న రిలీజైంది.

అయితే.. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. దీంతో.. నితిన్ సెంటిమెంట్ మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు. 

More News

గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు.

న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల

'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.

మెగా హీరోతో మరోసారి

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.