నితిన్ హీరోయిన్ మారింది

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

అందులో భాగంగా..హీరోయిన్ ఎంపిక జ‌రుగుతుంది. ముందుగా ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కార‌ణంగా పూజా ప్రాజెక్ట్‌లో న‌టించ‌లేన‌ని చెప్పేసింద‌ట‌.

దాంతో నిర్మాత‌లు హీరోయిన్‌గా నందితా శ్వేత‌ను ఫైన‌ల్ చేశార‌ట‌. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' త‌ర్వాత నందితా శ్వేత నిజార్ ష‌ఫీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ద్విభాషా చిత్రంలో న‌టిస్తుంది. త‌ర్వాత త‌ను చేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది మ‌రి.