షాకిచ్చిన ఛానెల్‌కు.. దిమ్మతిరిగేలా ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానెల్ ‘నిశ్శబ్దం’ టీంకు షాకిస్తే.. వెంటనే రియాక్ట్ అయిన టీం.. ఛానల్‌కు దిమ్మ తిరిగేలా నోటీసులు పంపించింది. వెంటనే అమెజాన్ ప్రైమ్ కూడా రియాక్ట్ అయి ఆ ఛానెల్‌కు చుక్కలు చూపించింది. అసలు విషయం ఏంటంటే.. ఈనెల రెండవ తేదీన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అతి త్వరలో తమ ఛానెల్‌లో ప్రసారం చేయబోతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన లోకల్ ఛానెల్ ఒకటి ప్రకటించింది.

‘నిశ్శబ్దం’ సినిమాను త్వరలో ప్రసారం చేయనున్నట్టు లోకల్ ఛానెల్ ప్రకటించిన విషయం ఆ సినిమా నిర్మాతల దృష్టికి సైతం వెళ్లింది. దీంతో ఆ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు నష్టపరిహారం కింద 1.1 కోట్ల రూపాయలు చెల్లించాలని వారికి లీగల్ నోటీస‌ులు కూడా పంపించారు. ఈ సినిమా హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌కు కూడా విషయం తెలియడంతో.. ఆ సంస్థ మరో రూ.30 లక్షలు నష్టపరిహారం కోరుతోందని సమాచారం. మొత్తానికి లోకల్ ఛానెల్‌కు అటు నిర్మాతలు.. ఇటు ప్రైమ్ కలిసి చుక్కలు చూపించారు.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో అనుష్క నటించింది. ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు 'నిశ్శబ్దం' టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

More News

బిగ్‌బాస్‌పై గీతా మాధురి సెటైర్..

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షో ముగిశాక కొందరు ఆరోపణలు గుప్పిస్తుంటారు.. మరికొందరు ఎడిటింగ్‌లో తమను మాటలను వక్రీకరించి చూపించారంటూ మండిపడుతుంటారు.

థియేటర్లు తెరిచాక రిలీజ్ కాబోయే తొలి సినిమా ఏదంటే...

సినిమా షూటింగ్‌లు.. ప్రతి ఒక్క హీరోది ఏదో ఒక సినిమా.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు సైతం కవర్ చేస్తుంటారు.

అవినాష్ రాజేసిన నిప్పు బాగా మండింది..

ఇవాళ షో అంతా ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. అవినాష్ చాలా ఇంటెలిజెంట్‌గా తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేస్తుండటంతో ఆ కారణంగా..

విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు.

రామ్ చరణ్ హోస్ట్‌గా డ్యాన్స్ టాలెంట్ షో.. ప్రత్యేకత ఏంటంటే..

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌‌‌గా ఉపాసన ఒక సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.