‘ఎస్ బ్యాంక్’ ఖాతాదారులకు నిర్మలమ్మ అభయం!

ప్రముఖ ‘ఎస్ బ్యాంక్’ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.!. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బు విత్ డ్రా కోసం సదరు బ్యాంక్ ఏటీఎంలకు బారులు తీరారు. ఖాతాదారులెవరూ నెలకు రూ.50,000కు మించి విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదని యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఈ నిధుల కొరత విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు.

మీ డబ్బు సేఫ్..

డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని.. మీ డబ్బు సేఫ్‌‌గానే ఉంటుందని సీతారామన్ వ్యాఖ్యానించారు. డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగదని ఆర్‌బీఐ గవర్నర్‌ తనకు స్పష్టం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ‘నెల రోజుల్లో ఎస్‌ బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నాం. ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి డబ్బు భద్రంగా ఉంటుంది.. డిపాజిటర్ల భద్రత కోసం ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. ఎస్‌ బ్యాంకు సంక్షోభాన్ని పరిష‍్కరించడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కృషిచేస్తోందన్నారు.

More News

మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌ విడుద‌ల

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

'అర్జున' 13వ తేదీకి వాయిదా

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు.

షూటింగ్ లో గాయపడ్డ అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.

ప‌వ‌న్ 27 లేటెస్ట్ అప్‌డేట్‌

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు.