షూటింగ్‌లో గాయపడిన నిఖిల్

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

యంగ్ హీరో నిఖిల్ షూటింగ్‌లో గాయపడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఈ యాక్సిడెంట్ జరిగింది. నిఖిల్‌, విలక్షణ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'కార్తికేయ 2'. ప్రస్తుం ఈ చిత్రం గుజరాత్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే చిత్రంలో ఒక కీలక సన్నివేశమైన మెయిన్ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. యాక్సిడెంట్‌ అయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో నిఖిల్‌కి స్వల్ప గాయాలు అవడంతో.. వెంటనే షూటింగ్‌ నిలిపివేశారు. ప్రస్తుతం నిఖిల్ కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఆ క్రమంలోనే మరికొన్ని రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ నిలిపివేయనున్నారని సమాచారం. నిఖిల్ కాలి గాయంతో బాధపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే.. నిఖిల్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయనకి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని.. ప్రస్తుతం ఆయన చక్కగానే ఉన్నారని చిత్ర యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

నిఖిల్‌, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

More News

'గాలి సంప‌త్' డెఫినెట్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది - శ్రీ విష్ణు

అప్ప‌ట్లోఒక‌డుండేవాడు, నీది నాది ఒకే క‌థ‌, మెంట‌ల్ మ‌దిలో.., బ్రోచెవారెవ‌రురా.. వంటి చిత్రాల‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు.

‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్.. ఇల్లెందులో తిరిగి ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరుకి జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా..

విశాఖ ఉక్కు కోసం వీలైతే వైజాగ్ వెళ్లి పోరాడుతాం: కేటీఆర్

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయనున్నారనే వార్త ప్రస్తుతం ఏపీని కుదిపేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి తీరుతామని కొద్ది రోజులుగా కేంద్రం సంకేతాలిస్తోంది.

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. సొంత పార్టీ నేతల అసమ్మతి కారణంగా సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

న్యూలుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న పవన్

దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయాలను.. ఇటు సినిమా షూటింగ్‌లనూ