నిహారిక వివాహం : రేర్ ఫోటోను షేర్ చేసిన చిరు..

మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల వివాహం మరికొన్ని గంటల్లో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. కాగా.. ఇప్పటికే ఇరువైపులా పెళ్లి పెద్దలతో పాటు అతిథులంతా వివాహ వేదిక అయిన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తొమ్మిది గంటలకు మొదలై... అర్ధరాత్రి వరకూ జరిగినట్టు సమాచారం. ఇక హల్దీ ఫంక్షన్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

మెహందీ వేడుక.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు జరగనుంది. ఫైనల్‌గా నిహారిక వివాహం.. బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. కాగా.. సంగీత్ కార్యక్రమంలో వధూవరులు నిహారిక, చైతన్య.. చిరంజీవి సినిమాలో పాటలకు డాన్స్‌ చేసి అలరించారు. రెండు, మూడు రోజుల నుంచి నిహారిక పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

నిన్న నాగబాబు తన కూతురి వివాహ విషయమై చేసిన ట్వీట్‌లో చాలా భావోద్వేగానికి గురయ్యారు. నేడు మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి నిహారికతో ఉన్న ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. తమ చేతుల్లో పెరిగిన చిన్నారి నిహారిక వివాహ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు. గాడ్‌ బ్లెస్‌ యు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

More News

‘చేజింగ్’లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వరలక్ష్మి శరత్‌కుమార్

వెరైటీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. లాక్‌డౌన్ తరువాత ఫుల్ బిజీగా మారిపోయింది.

రైతు కష్టాలు ఇవాళే కనిపించాయా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనం ఫైర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసినా తప్పే అవుతోంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు ఎక్కడికక్కడ ప్రజానీకం నిలదీసింది.

కేసీఆర్ ప్లాన్.. తెలంగాణలో వైసీపీ.. షర్మిలకు బాధ్యతలు!

రాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు.

హారిక, అఖిల్‌లపై సొహైల్ ఫైర్..

‘గాజువాక పిల్ల’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అరియానా తన లైఫ్ గురించి కెమెరాకు చెబుతోంది. తన ఫస్ట్ శాలరీ 4 వేలు అని చెప్పింది.

నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని కలిసిన సోము వీర్రాజు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు.