తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఈ పరిస్థితిపై తమిళనాడుకు చెందిన సెలబ్రిటీలు స్పందించి ఈ విపత్తు నుంచి జనాన్ని గట్టెక్కించమని కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ మురగదాస్, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రూ.లక్ష విరాళం ప్రకటించారు.

అంతేకాకుండా దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ పడక(బెడ్)ల సమాచారాన్ని 'ఫైండ్ ఏ బెడ్' పేరుతో బాధితులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ 'ఫైండ్ ఏ బెడ్'కు కాజ్ అంబాసిడర్‌గా నిధి ప్రచార సాయం కూడా నిర్వహిస్తోంది. ఇటీవలే రెండు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మకు తమిళ అభిమానులు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో మెగా సూర్య బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

More News

రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడా ? వీడియో వైరల్

సెలెబ్రిటీల మధ్య ఎఫైర్ స్టోరీలు అల్లేయడానికి నెటిజన్లకు చిన్న అవకాశం దొరికినా చాలు. అది నిజామా, అబద్దమా, మ్యాటర్ ఏంటి..

డైరెక్టర్ చేతులు పట్టుకుని అడిగాడు.. పవన్ కి ముందే తెలుసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పూలబాటేమీ కాదు. మెగాస్టార్ సోదరుడిగా సులువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దొరికింది.

నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్

ప్రముఖ నటి రేణూ దేశాయ్‌ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పెట్టే సరదా మెస్సేజ్‌లు కారణంగా నిజమైన బాధితులకు సాయం

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత టీకా కోసం 9 నెలలు ఆగాలట..

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సలహా కమిటీ కీలక సూచన చేసింది.

తెలుగు హీరోల బిరుదులు.. ఎలా మారాయో తెలుసా?

అభిమానులు ముద్దుగా పిలుచుకునేందుకు స్టార్ హీరోలకు బిరుదులు ఉంటాయి. ఆ బిరుదులు ఆకాశం నుంచి ఊడిపడ్డవి కాదు.