ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి నిధి అగ‌ర్వాల్ ఏమందంటే..?

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్‌గా రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇందులో ఓ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. మెఘల్ కాలపు నేపథ్యంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ మూవీ ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాను ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. ఒక‌రు నిధి అగ‌ర్వాల్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మ‌రో హీరోయిన్‌. ఇందులో నిధి అగ‌ర్వాల్ పాత్రను డైరెక్ట‌ర్ క్రిష్ చాలా ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశాడ‌ట‌. ఇందులో నిధి అగ‌ర్వాల్ పాత్ర దొంగ‌. రీసెంట్‌గానే కొన్ని స‌న్నివేశాల‌ను యూనిట్ స‌భ్యులు చిత్రీక‌రించారు.

రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో నిధి అగ‌ర్వాల్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘‘పవన్‌క‌ళ్యాణ్‌గారు సెట్స్‌లో ఉంటే ఆయ‌న చుట్టూ ఓ ఓరా ఉంటుంది. ప్ర‌జలు ఆయ‌న్ని ఎంతో గొప్ప‌గా చూస్తుంటారు. ఆయ‌న చాలా మంచి మ‌న‌స్త‌త్వంతో ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను వ‌ర్క్ చేసిన కోస్టార్స్‌లో ఆయ‌న బెస్ట్ కోస్టార్‌’’ అని తెలియ‌జేసింది నిధి అగ‌ర్వాల్‌.

More News

హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్న అల్లు శిరీష్!

మెగా హీరో అల్లు శిరీష్ గురించి ఓ వార్త ఇండటస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీకేం కొత్త కాదు కానీ..

ప్రియమైన వారి నుంచి ఉంగరం అందిందంటూ రష్మిక పోస్ట్..

నటి రష్మిక తాజాగా ఓ బహుమతి అందుకుంది. అది ఎవరి నుంచి అనేది తెలియదు కానీ ఆ గిఫ్ట్‌ని చూశాక ఆమె ఆనందానికి అవధుల్లేవని తెలుస్తోంది.

డ్రైవర్‌కు కరోనా.. మహేష్ ఫ్యామిలీ టెస్ట్ చేయించుకోగా..!

కరోనా సెకండ్ వేవ్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఫ్యాన్స్ బీభత్సం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.

ఎట్టకేలకు కదిలిన నౌక

సూయెజ్‌ కాలువలో కూరుకుపోయిన రాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. సుమారు ఆరు రోజులుగా పడుతున్న కష్టానికి సోమవారం ఫలితం లభించింది.