ఇండియాపై న్యూయార్క్ స్వాతి వీడియో.. నెట్టింట్లో వైరల్

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాల్లో లెక్కలేనంత మంది చనిపోతున్నారు. ఈ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు తేల్చిచెబుతున్నా.. మరికొన్ని మాత్రం దొంగలెక్కలు చెప్పేస్తున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా అయిపోతున్నాయ్. అమెరికాలాంటి అ్రగరాజ్యంలో అయితే రోజుకు 15వేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరణాల సంఖ్య అయితే రోజుకు ఎంతో.. చనిపోయినవారిని పూడ్చడానికి కూడా ఎవరూ దొరకని పరిస్థితుల్లో అమెరికా విలవిలాడుతోంది. మరోవైపు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో అయితే మరీ ఘోరం.

సీన్ రివర్స్..

అయితే ఇండియాలో మాత్రం అలాంటి పరిస్థితులు దాదాపు లేవు. కరోనా వ్యాధి ఇండియాలో విస్తరిస్తే, శవాల గుట్టలేనన్న దేశాలు అప్పట్లో ఎగతాళి చేస్తూ మాట్లాడాయి. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు అలా అన్న వాళ్లే ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తూ.. సాయం చేయండి మహాప్రభో అని అడుక్కుంటున్న పరిస్థితి. ఇందుకు అగ్రరాజ్యం అమెరికానే కారణం. తాజాగా న్యూయర్క్‌లో ఉంటున్న మన తెలుగు యువతి షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రపంచ దేశాలకి మన ఇండియాకు ఇప్పుడున్న పరిస్థితిలో వ్యత్యాసాన్ని ఆమె వివరించారు.

ఇదీ తేడా..

‘అభివృద్ధి చెందిన దేశం అమెరికా. కరోనా మహమ్మారి కారణంగా కకావికలమైంది. భారత్‌లోని పరిస్థితులను చూస్తే చాలా ముందుగానే అలెర్ట్ అయ్యారు. అగ్రరాజ్యంతో ఆధునిక జీవన విధానానికి.. ఇండియాలో పేదరికానికి చాలా తేడా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో అమెరికాలో.. ఇండియాలో ఎలా ఉందో చెప్పదలుచుకున్నాను. ఇండియా ముందుగానే మేల్కొంది. కరోనా వ్యాధి ఇండియాలో విస్తరిస్తే.. శవాల గుట్టలేనన్న దేశాలు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నాయి. ఇప్పుడు భారతావని ఎన్నో దేశాల ప్రశంసలను అందుకుంటోంది. కరోనాకు ఔషధాల కోసం ఎన్నో దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి’ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు యూ ట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను వేలాది మంది షేర్ చేస్తున్నారు.

More News

మరో 2వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రధాని అంగీకారం!?

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్-14తో లాక్‌డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

‘రెడ్‌’ రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్‌

కోవిడ్ 19 దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే కుదేల‌వుతుంది. భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డింది. ప‌లు రంగాలు కుంటుప‌డ్డాయి.

నాని ‘వి’ సినిమాకు భారీ ఆఫ‌ర్‌.. నిర్మాత‌లు ఒప్పుకుంటారా?

నేచురల్ స్టార్ నాని, మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా..సుధీర్ బాబు అత‌న్ని

బన్నీ సినిమాలో బాలీవుడ్ విలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి .. త‌మ‌న్‌: బ‌న్నీ

బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేవు. ఎప్ప‌టి నుండో ఎదురు చూసిన సాలిడ్ హిట్‌ను ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సాధించేశాడు. బ‌న్నీ,